చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం: గుండుమల
ABN , First Publish Date - 2022-05-18T06:22:38+05:30 IST
పెనుకొండ నియోజకవర్గం సోమం దేపల్లిలో ఈనెల 20న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చం ద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు.
మడకశిర టౌన, మే 17: పెనుకొండ నియోజకవర్గం సోమం దేపల్లిలో ఈనెల 20న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చం ద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం స్థా నిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను చూసి చలించిన చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యా్సతో పాటు నిత్యావసరాల ధర లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయన్నారు. ఈ ప రిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయకత్వాన్ని జనం కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికే చంద్రబాబు వస్తున్నట్లు తెలిపారు. సో మందేపల్లిలో చేపట్టిన ‘బాదుడే బాదుడు’ నిరసనకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.