పారిశుధ్యాన్ని మెరుగుపరుద్దాం

ABN , First Publish Date - 2022-01-22T05:20:58+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరుద్దామని జిల్లా పరిషత్‌ సీఈఓ సుధాకర్‌రెడ్డి అన్నారు.

పారిశుధ్యాన్ని మెరుగుపరుద్దాం

వల్లూరు, జనవరి 21:గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరుద్దామని జిల్లా పరిషత్‌ సీఈఓ సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వల్లూరులోని ఎస్‌డబ్ల్యూపీసీ (చెత్త కేంద్రం) సందర్శించారు. అనంతరం స్థానిక గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ వల్లూరు మండలంలో 9 చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో పని చేయడానికి అం దరూ సహకరించాలని కోరా రు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి కార్యదర్శి క్షేత్రస్థాయికి వెళ్లి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ సురే్‌షబాబు, స్థానిక ఈఓపీఆర్‌డీ ప్రసాద్‌, ఎమ్మార్వో శంకరయ్య, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:20:58+05:30 IST