ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దాం

ABN , First Publish Date - 2022-08-13T05:52:25+05:30 IST

జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దాం
వేడుకలు జరిగే మైదానాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్‌ 

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 12 :  జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.   వేడుకలు నిర్వహించే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణాన్ని  శుక్రవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.  పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున అంతటా పక్కాగా ఉండాలని సూచించారు. వేడుకలతోపాటు శకటాలు, వివిధ స్టాల్స్‌ ప్రదర్శన అనేది రాష్ట్రంలోనే అత్యుత్తమంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జేసీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T05:52:25+05:30 IST