కరోనాను తరిమికొడదాం

ABN , First Publish Date - 2021-10-28T05:24:01+05:30 IST

ఆనందయ్య మందుతో కరోనాను తరిమికొడదామని మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌ రెడ్డి దంపతులు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అన్నారు.

కరోనాను తరిమికొడదాం
ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి దంపతులు

- మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి దంపతులు

- ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ


దేవరకద్ర, అక్టోబరు 27 : ఆనందయ్య మందుతో కరోనాను తరిమికొడదామని మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌ రెడ్డి దంపతులు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అన్నారు. మండల కేంద్రంలోని శ్రీనివాసగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో మాజీ ఎమ్మెల్యే సీతమ్మ జన్మదినం సందర్భంగా కేక్‌కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కృష్ణప ట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆయనతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డి ప్రజలకు ఉచితంగా మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి కరోనా వ్యాధితో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ ఆయుర్వేద మందు వాడటం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని, ప్రతీ ఒక్కరు ఈ మందును వాడవచ్చన్నారు. వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మందను తీసుకెళ్లారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆది హన్మంత్‌ రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, నాగయ్య, నాగరాజు, రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:24:01+05:30 IST