అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , First Publish Date - 2021-10-23T05:36:24+05:30 IST

అవినీతి రహిత స మాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని, అందులో ఉద్యోగుల పా త్ర కీలకమని యూనియన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం సింహాచలం అన్నారు.

అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం


అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 22: అవినీతి రహిత స మాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని, అందులో ఉద్యోగుల పా త్ర కీలకమని యూనియన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం సింహాచలం అన్నారు. విజిలెన్స అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక సంగమేష్‌ సర్కిల్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు యూనియన బ్యాంకు ఆధ్వర్యంలో మారథాన నిర్వహించారు. అం దులో నరసింహం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి అవినీతిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపనలో అవినీతి, లంచం అవరోధాలుగా నిలిచాయన్నారు. నిస్వార్థసేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూనియన బ్యాంక్‌ నోడల్‌ అధికారి మధుభూషణ్‌రెడ్డి, ఏజీఎం నరసింహం, నగరంలోని బ్రాంచల మేనేజర్లు, అధికారులు, ఖాతాదారులు, డిపా జిటర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-23T05:36:24+05:30 IST