స్థానిక ఎన్నికల్లో జగన్ కు గుణపాఠం: సోమిశెట్టి

ABN , First Publish Date - 2021-01-21T20:32:18+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం జగన్ కు, వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి

స్థానిక ఎన్నికల్లో జగన్ కు గుణపాఠం: సోమిశెట్టి

 కర్నూలు : స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం జగన్ కు, వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును అనుసరించి వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.


రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. విగ్రహాలు ధ్వంసం అవుతున్నాప్రభుత్వం ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండడంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పోలీసు వ్యవస్థను వైసీపీ నాయకులు సర్వనాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంతా జరుగుతున్నా పోలీసు సంఘాలు ఎందుకు స్పందించడం లేదని సోమిశెట్టి  ప్రశ్నించారు. 

Updated Date - 2021-01-21T20:32:18+05:30 IST