‘కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదు’
ABN , First Publish Date - 2021-04-11T05:11:13+05:30 IST
కుష్టువ్యాధి అంటువ్యాధి కాదని, వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని పీఎంపీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏఆర్కే పరమేశ్వర్లు అన్నారు.
గణపవరం, ఏప్రిల్ 10: కుష్టువ్యాధి అంటువ్యాధి కాదని, వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని పీఎంపీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏఆర్కే పరమేశ్వర్లు అన్నారు. పిప్పర పీహెచ్సీలో కుష్టు వ్యాధి నిర్మూలనపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని వ్యాధిగ్రస్థులను గుర్తించి ప్రభుత్వ వైద్యుల సహకారంతో మందులు, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంపీహెచ్ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శరీరంపై రాగి రంగు మచ్చలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు, మందులు పంపిణీ చేశారు. లెప్రసీ నోడల్పర్సన్ నామాల రాజు, పీఎంపీల సంఘ మండల కార్యదర్శి శ్రీనివాస్, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.