చిరుత కలకలం?

ABN , First Publish Date - 2020-03-30T11:33:40+05:30 IST

మండల పరిధిలో చిరుత కలకలం రేపుతోంది. తాజాగా చిరుత మరో లేగదూడపై దాడి చేయడంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు రామ్‌సింగ్‌నాయక్‌ శనివారం సాయంత్రం పొలం వద్ద పశువులను కట్టేసి ఇంటికొచ్చాడు.

చిరుత కలకలం?

కులకచర్ల: మండల పరిధిలో చిరుత కలకలం రేపుతోంది. తాజాగా చిరుత మరో లేగదూడపై దాడి చేయడంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు రామ్‌సింగ్‌నాయక్‌ శనివారం సాయంత్రం పొలం వద్ద పశువులను కట్టేసి ఇంటికొచ్చాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా లేగదూడ పక్కనే పొదలో మృతి చెంది ఉండడాన్ని గమనించి చిరుత సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలాన్ని అటవిశాఖ అధికారులు, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, తహాశీల్దార్‌ ఆశోక్‌కుమార్‌ సందర్శించారు. చిరుతదాడి చేయడంతోనే లేగదూడ మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-30T11:33:40+05:30 IST