లీజు హక్కుల వేలం
ABN , First Publish Date - 2021-06-17T03:45:01+05:30 IST
కోట పంచాయతీ పరిధిలోని దుకాణాల భవనాల లీజు హక్కులకు బుధవారం నిర్వహించిన వేలంలో గ్రామ పంచాయతీ ఆదాయం కొద్దిగానే పెరిగింది.
స్వల్పంగా పెరిగిన ఆదాయం
కోట, జూన్ 16 : కోట పంచాయతీ పరిధిలోని దుకాణాల భవనాల లీజు హక్కులకు బుధవారం నిర్వహించిన వేలంలో గ్రామ పంచాయతీ ఆదాయం కొద్దిగానే పెరిగింది. కొత్తవారు వేలంలో పాల్గొనకుండా, పాత లీజుదారులు పావులు కదపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఈ దుకాణాల ద్వారా పంచాయతీకి రూ.6 లక్షలు ఆదాయం లభించగా ఈ ఏడాది అది రూ.7 లక్షలకు పెరిగింది. డీఎల్పీవో వెంకటరమణ, ఈవోపీఆర్డీ స్వరూపారాణి, సర్పంచ్ వెంకటరమణమ్మ, కార్యదర్శి నెలవల రాజశేఖర్ వేలం నిర్వహించారు. .