Gutta sukender reddy: మునుగోడు ఉప ఎన్నిక బలవంతంగా తెచ్చిన ఎన్నిక
ABN , First Publish Date - 2022-08-18T15:27:07+05:30 IST
20న జరిగే ప్రజా దీవెన సభను నల్గొండ జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.
నల్గొండ: 20న జరిగే ప్రజా దీవెన సభను నల్గొండ జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta sukender reddy) కోరారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడేళ్లలోనే మూడు ఉపఎన్నికలు వచ్చాయన్నారు. హుజూర్నగర్, నాగార్జున సాగర్లలో ఉపఎన్నికలు తప్పని పరిస్థితుల్లో వచ్చినా మునుగోడు ఉప ఎన్నిక బలవంతంగా తెచ్చిన ఎన్నిక అని తెలిపారు. అధికారం కోసం కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) కలలు కంటున్నాయన్నారు. ఎనిమిదేళ్ళ బీజేపీ పాలనలో విపరీతమైన ధరల పెరుగుదల, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పురోగతి జరిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.