ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-10-29T05:15:31+05:30 IST

నిత్యావర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం నెల్లూరు సిటీ, రూరల్‌ కార్యదర్శులు మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
ఆందోళన చేస్తున్న సీపీఎం, సీపీఐ నాయకులు

సీపీఎం, సీపీఐ నిరసన

నెల్లూరు (వైద్యం), అక్టోబరు 28 : నిత్యావర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం నెల్లూరు సిటీ, రూరల్‌ కార్యదర్శులు మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.  ధరల పెరుగుదలకు నిరసనగా గాంధీబొమ్మ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు.  వారు మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధర పెంపుతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. త్వరలో వంట గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతాయనే సమాచారం పేద, మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తక్షణం పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో కిశోర్‌బాబు, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:15:31+05:30 IST