పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు
ABN , First Publish Date - 2021-02-27T04:37:17+05:30 IST
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ మానుకోవాలంటూ శుక్రవారం వామపక్షాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక టవర్క్లాక్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.
పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు
గూడూరురూరల్, ఫిబ్రవరి 26: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ మానుకోవాలంటూ శుక్రవారం వామపక్షాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక టవర్క్లాక్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం ఏ రోజుకారోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, కేశవులు, పరిమల వెంకటేశ్వర్లు, ముత్యాలయ్య, మణి, జోగి శివకుమార్, బీవీరమణయ్య, సునీల్, చంద్రయ్య, వ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.