పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు

ABN , First Publish Date - 2021-02-27T04:37:17+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల తగ్గింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ మానుకోవాలంటూ శుక్రవారం వామపక్షాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు
ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులు

పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు

గూడూరురూరల్‌, ఫిబ్రవరి 26: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల తగ్గింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ మానుకోవాలంటూ శుక్రవారం వామపక్షాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం ఏ రోజుకారోజు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, కేశవులు, పరిమల వెంకటేశ్వర్లు, ముత్యాలయ్య, మణి, జోగి శివకుమార్‌, బీవీరమణయ్య, సునీల్‌, చంద్రయ్య, వ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:37:17+05:30 IST