కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వామపక్షాల ధర్నా
ABN , First Publish Date - 2020-08-15T23:22:13+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర
అనంతపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు చర్యలు తీసుకోకుండా తమ తమ రహస్య అజెండాలను అమలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.