భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-05-02T21:50:18+05:30 IST

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన ఏడాది వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు..

భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన ఏడాది వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో ఆ మహిళ ఏడాదిన్నర క్రితం భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది.. అక్కడ ఓ వ్యక్తి ఆమెను ట్రాప్ చేశాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. చివరకు మోసం చేశాడు.. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని భిళ్వారా గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహిళ ఏడాదిన్నర క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెను ఓ వ్యక్తి ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఏడాదిగా ఆమెతో కలిసే అతను ఉంటున్నాడు. ఇటీవల వేరే మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు. 


విషయం తెలుసుకున్న బాధిత మహిళ అతడిని నిలదీసింది. దీంతో అతడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై అత్యాచార చట్టం కింద కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Read more