ఎల్ఈడీ లైట్లు ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-27T05:48:09+05:30 IST
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను బుధవారం రాత్రి బెల్లంపల్లి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు చింతల శ్రీనివాస్, సంజీవరెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
బెల్లంపల్లి, జనవరి 26 : బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను బుధవారం రాత్రి బెల్లంపల్లి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు చింతల శ్రీనివాస్, సంజీవరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తిలక్ స్టేడియం అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లతో స్టేడియం కొత్తకళను సంతరించుకుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, నాయకులు మల్రాజు శ్రీనివాసరావు, గెల్లి రాయలింగు, సత్యనారాయణ, మోహన్రావు, శ్రీనివాస్, మౌనిక్, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.