పార్లమెంట్ జూమ్ కాల్.. నగ్నంగా కంటపడ్డ నాయకుడి భార్య!

ABN , First Publish Date - 2021-04-04T06:30:18+05:30 IST

అది దేశ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ సమావేశం. అయితే కరోనా కారణంగా దాన్ని జూమ్ కాల్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

పార్లమెంట్ జూమ్ కాల్.. నగ్నంగా కంటపడ్డ నాయకుడి భార్య!

కేప్‌టౌన్: అది దేశ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ సమావేశం. అయితే కరోనా కారణంగా దాన్ని జూమ్ కాల్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జూమ్ మీటింగ్‌లో ఉన్న ఓ నాయకుడి భార్య అనుకోకుండా కెమెరా ముందుకొచ్చేసింది. దీనిలో పెద్ద వింతేమీ లేదు. కానీ ఆ సమయంలో ఆమె శరీరంపై నూలుపోగు కూడా లేదు. దీంతో ఈ మీటింగ్‌లో పాల్గొన్న వారు షాకయ్యారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇక్కడి సంప్రదాయ నేత జోలైల్ ఎన్దేవు.. తన తోటి నేతలైన మరో 23 మందితో పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు. జూమ్ కాల్ ద్వారా ఈ మీటింగ్ జరుగుతోంది.


ఆ సమయంలో ఎన్దేవూ సతీమణి ఆయన వెనక్కు వచ్చారు. ఆ సమయంలో ఆమె నగ్నంగా ఉన్నారు. అయితే దీన్ని ఎన్దేవూ కూడా చూసుకోలేదు. ఆ సమయంలో కమిటీ చైర్‌పర్స్ పరిస్థితిని తెలియజేస్తూ.. ‘‘మీ వెనుక ఉన్న వాళ్లు సరిగా దుస్తులు ధరించలేదు. మేము అంతా చూసేస్తున్నాం. మేం చూస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉంది’’ అని చెప్పడంతో వెనక్కు తిరిగి చూసిన ఎన్దేవూ దిమ్మతిరిగిపోయింది. ఆ వెంటనే సమావేశాన్ని నిలిపివేస్తున్నట్లు చైర్‌పర్సన్ ప్రకటించారు. ఈ ఘటనపై ఆ తర్వాత మాట్లాడిన ఎన్దేవే క్షమాపణలు చెప్పుకున్నారు.

Updated Date - 2021-04-04T06:30:18+05:30 IST