బీజేపీ విజయసంకల్ప సభకు బయలుదేరిన నాయకులు

ABN , First Publish Date - 2022-07-04T03:47:37+05:30 IST

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభకు ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.

బీజేపీ విజయసంకల్ప సభకు బయలుదేరిన నాయకులు
కాగజ్‌నగర్‌ నుంచి ప్రత్యేక రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌, జూలై3: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభకు ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక రైళ్లతో పాటు సొంతవాహనాలలో పెద్దఎత్తున తరలివెళ్లారు. వెళ్లిన వారిలో జిల్లాఉపాధ్యక్షుడు విశాల్‌, రాధిక, శ్రావణ్‌ గౌడ్‌, గణేష్‌, తిరుపతి, ఆకాష్‌, తదితరులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక రైలులో వెళ్లారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ జెండాఊపి రైలునుప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విజయసంకల్ప సభలో బీజేపీ చేపట్టే అభివృద్ధి పథకాలపై సమీక్ష జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులు డాక్టర్‌ హరీష్‌బాబు, కొంగ సత్యనారాయణ, గోలెంవెంకటేష్‌, సిర్పూరు నియోజవకర్గంలోని వివిధగ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T03:47:37+05:30 IST