బీజేపీ గూటికి పలు పార్టీల నేతలు

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

బీజేపీ గూటికి పలు పార్టీల నేతలు

బీజేపీ గూటికి పలు పార్టీల నేతలు
ఆమనగల్లు: పార్టీలోకి ఆహ్వానిస్తున్న సమీర్‌ మహంతి

ఆమనగల్లు/కడ్తాల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌, జూలై 1: కడ్తాల మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గూడూరు రవీందర్‌రెడ్డి, సింహాద్రి, కల్వకుర్తి మండలం రాంనగర్‌, వెల్దండ మండలం కంటోనిపల్లికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ నాయకుడు, ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో బీజేపీ ఒడిస్సా రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌ మహంతి సమక్షంలో వారు బీజేపీలో చేరారు. వారికి మహంతి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాములు, బీజేపీ నాయకులు కండె హరిప్రసాద్‌, మోహన్‌రెడ్డి, మన్యనాయక్‌, అశోక్‌రెడ్డి, రమేశ్‌, రవీందర్‌రెడ్డి, సాయిలాల్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ పరిధి మొగిలిగిద్దకు చెందిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్‌గుప్త ఇంట్లో బీజేపీ జాతీయ అధికారప్రతినిధి ఆర్‌పీసింగ్‌ సమక్షంలో యువకులు బీజేపీలో చేరారు.  

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST