రవిబాబుకి పదవి పట్ల నేతల హర్షం
ABN , First Publish Date - 2021-03-05T06:18:38+05:30 IST
ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల అరకు నియోజకవర్గ వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
అరకులోయ, మార్చి 4: ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల అరకు నియోజకవర్గ వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీటీసీ మాజీ సభ్యులు సమర్ది భాస్కరరావు, భూర్జబారికి సుందరరావు, పెదలబుడు మాజీ సర్పంచ్ పాంగి చిన్నారావు, మాజీ వైస్ సర్పంచ్ పి.విజయ్కుమార్, నాయకులు పరుశురాం, రమణ, నాయుడు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.