LB Nagarలో మందుబాబులు వీరంగం..

ABN , First Publish Date - 2022-01-02T17:40:16+05:30 IST

ఎల్బీనగర్‎లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో

LB Nagarలో మందుబాబులు వీరంగం..

హైదరాబాద్: ఎల్బీనగర్‎లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహాం చెందిన మందుబాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మందుబాబుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు నర్సింహారెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జాయిన్ చేసిన కొద్దీ సేపటికే నర్సింహారెడ్డి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం మందు బాబులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-01-02T17:40:16+05:30 IST