సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-02-06T01:57:01+05:30 IST

జిల్లాలోని హుజూర్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి

సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సూర్యాపేట: జిల్లాలోని హుజూర్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలసౌకర్యం కోసం చేసే ప్రతి పని మూడు నెలల్లో పూర్తి కావాలన్నారు. దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. 


ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సమృద్ధి యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా రోడ్డు కోసం రూ.4కోట్లు మంజూరయ్యాయన్నారు. గతంలోతన దృష్టికి వచ్చిన అన్ని పనులను మంజూరు చేయించింది తానేనన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-06T01:57:01+05:30 IST