విజయం మాదే: లక్ష్మణ్

ABN , First Publish Date - 2020-12-04T19:01:00+05:30 IST

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ మెజారిటీ సాధించిందని లక్ష్మణ్ అన్నారు.

విజయం మాదే: లక్ష్మణ్

హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ మెజారిటీ సాధించిందని లక్ష్మణ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 75కుపైగా డివిజన్లలో బీజేపీ ఆధిక్యత సాధించిందన్నారు. ఇంత ఆధిక్యత వచ్చిందంటే.. ఇది విజయానికి సంకేతమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారంటే.. ప్రజలకు కూడా ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. మొదటి నుంచి అధికారపార్టీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కయిందని ఆయన విమర్శించారు. బీజేపీ గెలవకుండా కుట్రలు చేసిందన్నారు. తక్కువ శాతం పోలింగ్ కావాలని ప్రభుత్వం కోరుకుందని ఆరోపించారు. అయినప్పటికి ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పతనానికి ఇది నాంది అని  లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-04T19:01:00+05:30 IST