న్యాయవాదులకు దండంపెట్టిన రఘురామ
ABN , First Publish Date - 2021-05-18T01:48:32+05:30 IST
ఘురామకృష్ణరాజును జైలుకు పంపేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఇటీవల రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణరాజును జైలుకు పంపేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రామరామ అరెస్ట్పై ఆయన తరపు న్యాయవాదులు అటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయవాదులు కృషి ఫలితంగా ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి తరలించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో గుంటూరు నుంచి హైదరాబాద్కు రఘురామను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని రఘురామకు లాయర్లు ఇచ్చారు. న్యాయవాదులను చూసిన ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన న్యాయవాదులకు రెండు చేతిలెత్తి దండంపెట్టారు. దండం పెట్టగానే న్యాయవాదులు కూడా ఉద్వేగానికి గురయ్యారు.