కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన
ABN , First Publish Date - 2021-07-31T06:14:52+05:30 IST
న్యాయమూర్తి, న్యాయవాది హత్యలను నిరసిస్తూ శుక్రవారం వేములవాడ కోర్టు ఎదుట న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
వేములవాడ, జూలై 30 : న్యాయమూర్తి, న్యాయవాది హత్యలను నిరసిస్తూ శుక్రవారం వేములవాడ కోర్టు ఎదుట న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల భూమేష్ మాట్లాడుతూ జార్ఖండ్ లోని ధన్బాద్లో ఉదయం వాకింగ్కు వెళ్లిన న్యాయమూర్తి ఉదయ్ఆనంద్ను వాహనంతో ఢీకొట్టి హత్య చేయడం బాధాకరమన్నారు. హైదరాబాద్లో న్యాయవాది రయిసా ఫాతిమా హత్య ఘటనను ఖండిస్తున్నామన్నారు. దేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, రక్షించా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్గౌడ్, పెంట రాజు, నక్క దివాకర్, పిట్టల మనోహర్, గుడిసె సదా నందం, కొడిమ్యాల పురుషోత్తం, సుధాకర్ రెడ్డి, గోపి, పర్లపల్లి అంజన్న, పిల్లి మధు, సంటి సృజీవన్, కాతుబండ నర్సింగరావు, బొజ్జ నరేష్, బొడ్డు ప్రశాంత్, పారువెల్ల శ్రీనివాస్, రజనీకాంత్, లింగాల నారా యణరావు, ఏదుల తిరుపతి, పంపరి శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.