న్యాయవాదుల నిరసన

ABN , First Publish Date - 2021-07-31T05:02:31+05:30 IST

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన
తాండూరులో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

తాండూరు/ పరిగి: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో అదనపు జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌, హైదరాబాద్‌లో మహిళా న్యాయవాది రాయిస ఫాతిమాలను వేర్వేరు సంఘటనల్లో జరిగిన హత్యలను తాండూరు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. తాండూరులోని జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు ఆవరణలో శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌, కార్యదర్శి రవికుమార్‌, కోశాధికారి సుదర్శన్‌, మస్తాన్‌,  భవనప్ప, గుండప్ప, ప్రభాకర్‌, గోపాల్‌, రవికుమార్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా పరిగి కోర్టు బార్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వి.రాము, గౌస్‌పాషలు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లింగం, నరేంద్రయాదవ్‌, దామోదర్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:02:31+05:30 IST