ఎస్బీఐ ‘యోనో’ బ్రాంచ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-09-24T09:03:20+05:30 IST
అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ ఎస్బీఐ తన ఆన్లైన్ సేవల ‘యోనో’ శాఖను హైటెక్ సిటీలో ప్రారంభించింది. ఎస్బీఐ
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బ్రాంచ్ హైటెక్సిటీలో..
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ ఎస్బీఐ తన ఆన్లైన్ సేవల ‘యోనో’ శాఖను హైటెక్ సిటీలో ప్రారంభించింది. ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్ నుంచి ఆన్లైన్లో ఎస్బీఐ చైర్మన్ రంజనీష్ కుమార్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రారంభించారు. ఆన్లైన్ వేదికగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ రంజనీ్షకుమార్ మాట్లాడుతూ ఈ శాఖలో అన్నిసేవలు అభినందించదగ్గ స్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కస్టమర్లు యోనో క్విక్పేను విరివిగా ఉపయోగించాలని సూచించారు.
డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ ఈ శాఖ ఆన్లైన్ సేవల లాభాలను అందరూ వినియోగించుకోవాలని. ఎస్బీఐ చీఫ్ జనరల్ హైదరాబాద్ సర్కిల్ మేనేజర్ జీపీ మిశ్రా మాట్లాడుతూ ఈశాఖ దేశంలోనే నాలుగోదని, దక్షిణభారతదేశంలో మొట్టమొదటి బ్రాంచ్ అన్నారు. కార్యక్రమంలో ఎన్డబ్ల్యూ 1 జనరల్ మేనేజర్ అజయ్కుమార్సింగ్, ఎన్డబ్ల్యూ2 జరనర్ మేనేజర్ జోగేష్ చంద్రసాహు, ఎఫ్ఐఎంఎం జనరల్ మేనేజర్ కిషన్శర్మ, సికింద్రాబాద్ ఏవో డిప్యూటీ జనరల్ మేనేజర్ దేబాషిష్మిశ్రా, మాదాపూర్ రీజియన్ ఏజీఎం బిందు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.