వరంగల్ సామూహిక హత్యకేసులో తాజా అప్డేట్ ఇదీ..

ABN , First Publish Date - 2020-06-05T00:05:00+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట 9మంది సామూహిక హత్యకేసులో

వరంగల్ సామూహిక హత్యకేసులో తాజా అప్డేట్ ఇదీ..

వరంగల్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట 9మంది సామూహిక హత్యకేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ను ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. ఆ తర్వాత తిరిగి జడ్జి ఎదుట నిందితుడ్ని పోలీసులు ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ విచారణలో కొత్త విషయాలేమీ నిందితుడు వెల్లడించలేదు.


ఆహారంలో మత్తు టాబ్లెట్స్ కలిపి తాను ఒక్కడినే అంతం చేశానని మాత్రమే వాంగ్మూలంలో చెప్పాడు. ఈ క్రమంలో మత్తు టాబ్లెట్స్ కొన్న మందుల దుకాణానికి తీసుకెళ్లి పోలీసులు విచారణ జరిపారు. సంజయ్ హత్య చేసిన రఫిక పిల్లలను కూడా పోలీసులు విచారించారు. ఈ కేసు వ్యవహారం ఓ కొలిక్కి ఎప్పుడొస్తుందో.. అసలు దీని వెనుక ఎవరెవరున్నారో తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి.

Updated Date - 2020-06-05T00:05:00+05:30 IST