బియ్యం పంపిణీకి నేటి వరకు గడువు పొడిగింపు : జేసీ
ABN , First Publish Date - 2022-08-19T05:28:14+05:30 IST
జిల్లాలో రెండు రకాల బియ్యం పంపిణీకి ప్రభుత్వం శుక్రవారం వరకు గడువు పొడిగించిందని జేసీ వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 18: జిల్లాలో రెండు రకాల బియ్యం పంపిణీకి ప్రభుత్వం శుక్రవారం వరకు గడువు పొడిగించిందని జేసీ వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగదు బియ్యం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని ఇంతవరకు పొందని కార్డుదారులు, కూపన్దారులు శుక్రవారంలోగా తీసుకోవాలని కోరారు. బుధవారంతో ముగిసిన గడువును కార్డుదారుల అభ్యర్థనతో పొడిగించినట్లు పేర్కొన్నారు.