ఎన్టీఎస్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-12-01T05:12:28+05:30 IST
ఎన్టీఎస్ఈ లెవల్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు (విద్య) నవంబరు 30 : ఎన్టీఎస్ఈ లెవల్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 15 లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 16 లోపు పరీక్ష రుసుము రూ.200 చలానా రూపంలో ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన ఎన్టీఎస్ఈ పేమెంట్ ట్యూబ్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు నామినల్ రోల్స్ను 18న డీఈవో కార్యాలంయలో సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్యూ డాట్ బీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ నగరంలోని దర్గామిట్ట జడ్పీ పాఠశాలలో ఉన్న పరీక్షల విభాగం కార్యాలయంలో కానీ సంప్రదించాలని సూచించారు.