లారీ మోటారు బైకు ఢీ : ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-03-04T05:23:30+05:30 IST
మండల పరిధిలోని మార్గోపల్లె వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
చిట్వేలి, మార్చి 3 : మండల పరిధిలోని మార్గోపల్లె వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రాజంపేట మండలం అప్పారాజుపేట గ్రామం కడియాలపల్లెకు చెందిన పొత్తపి మనోహర్ (23), పేరూరు వెంకటే్షలుగా గుర్తించామన్నారు. బుధవారం వారు ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం గ్రామంలో పేరూరు వెంకటేష్ అవ్వ పెద్దకర్మకు మోటారు సైకిల్పై వెళ్లి తిరిగి చిట్వేలి మీదుగా కడియంపల్లెకు వస్తుండగా మార్గోపల్లె గ్రామం దగ్గరలోని మలుపు వద్ద చిట్వేలి వైపు నుంచి లారీ డ్రైవర్ అతివేగంగా వస్తూ మోటారు బైకును ఢీకొనడంతో మనోహర్ మృతి చెందగా వెంకటేష్కు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.