లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-25T05:53:30+05:30 IST

అతివేగంగా వచ్చిన లారీ దూసుకెళ్ళడంతో బస్సు దిగుతున్న ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం పిచ్చాటూరు మండలం కీళపూడి బస్టాండ్‌లో జరిగింది.

లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
దేశయ్యమందడి(ఫైల్‌ఫొటో)

పిచ్చాటూరు, జనవరి 24: అతివేగంగా వచ్చిన లారీ దూసుకెళ్ళడంతో బస్సు దిగుతున్న ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం పిచ్చాటూరు మండలం కీళపూడి బస్టాండ్‌లో జరిగింది. కీళపూడి గ్రామానికి చెందిన దేశయ్యమందడి(65) సోమవారం ఉదయం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పిచ్చాటూరులోని ఆస్పత్రికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కీళపూడి బస్టాండ్‌ వద్ద బస్సు దిగుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన లారీ అతడిని తొక్కుకుంటూ వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో దేశయ్య శరీరం నుజ్జు నుజ్జుకాగా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు నారాయణవనం పోలీసులకు సమాచారం అందించి ప్రమాదానికి కారమైన లారీని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దేశయ్యమందడికి పెళ్లి అయిన కుమార్తె మాత్రమే ఉంది.

Updated Date - 2022-01-25T05:53:30+05:30 IST