లారీ ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-05-16T06:25:31+05:30 IST
అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిలో లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. మండలంలోని గాలిభీమవరం శివారు జాగారపువానిపాలెం గ్రామానికి చెందిన నక్క కిరణ్ (19) ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై సబ్బవరం వచ్చాడు.
సబ్బవరం, మే 15: అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిలో లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. మండలంలోని గాలిభీమవరం శివారు జాగారపువానిపాలెం గ్రామానికి చెందిన నక్క కిరణ్ (19) ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై సబ్బవరం వచ్చాడు. సామాన్లు కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఇరువాడ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విశాఖలోని ఒక ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందాడు. తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. కాగా, వెంకటలక్ష్మి భర్త, పెద్ద కుమారుడు మృతి చెందారు. దీంతో కూలి చేసుకుంటూ చిన్న కుమారుడు కిరణ్ను చదివించుకుంటున్నది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఇక లేడని తెలిసి ఆమె గుండెలవిసేలా విలపించడం చూసిన వారు కూడా కంట తడి పెట్టారు.