టీ తాగేందుకు బయటకు వచ్చి..

ABN , First Publish Date - 2020-07-02T10:52:34+05:30 IST

టీ తాగేందుకు వరుసకు అన్నదమ్ములైన ఇద్దరు మోటా రు సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు రాగా లారీ రూపంలో మృత్యుదేవత వారిని కబ

టీ తాగేందుకు బయటకు వచ్చి..

లారీ ఢీకొని అన్నదమ్ములు మృతి 


ఏలూరు క్రైం, జులై 1: టీ తాగేందుకు వరుసకు అన్నదమ్ములైన ఇద్దరు మోటా రు సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు రాగా లారీ రూపంలో మృత్యుదేవత వారిని కబ ళించింది. ఏలూరు నవాబ్‌పేటకు చెందిన షేక్‌ పండు (50)కు భార్య ఇద్దరు కుమా రులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డెక రేషన్‌ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి వరుసకు సోద రుడైన షేక్‌ ఐషాబాబు (50)  పవరు పేటలో నివాసం ఉంటూ టెంట్‌ హౌస్‌ నిర్వ హిస్తున్నారు.


బుధవారం రాత్రి ఐషా బాబు తన మోటారు సైకిల్‌పై నవాబుపేట వెళ్లి పండును టీ తాగడానికి రమ్మని పిలిచి మోటారు సైకిల్‌పై వెక్కించుకుని వెళ్లాడు. కర్రల వంతెన సమీపం లో వసంతమహల్‌ వైపు నుంచి పాతబస్టాండ్‌ వైపు వెళ్తుండగా వెనుక నుంచి ఒక లారీ ఢీ కొనడంతో వారిద్దరూ మృతి చెందారు. సమాచారం అందడంతో టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, ఎస్‌ఐ కె.నాగేంద్ర ప్రసాద్‌, ట్రైనీ డీఎస్పీ హర్షిత చంద్ర,  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహా లను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వా స్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-07-02T10:52:34+05:30 IST