లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-05-16T05:22:26+05:30 IST

లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారిపై కోమటిపల్లి జంక్షన్‌ వద్ద శనివారం చోటుచేసుకుంది.

లారీ ఢీకొని ఒకరి మృతి

దత్తిరాజేరు, మే 15: లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారిపై కోమటిపల్లి జంక్షన్‌ వద్ద శనివారం చోటుచేసుకుంది. దీనిపై పెదమానాపురం ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చుక్కపేట గ్రామానికి చెందిన తాడేల అప్పన్న(39) శనివారం తన బైకుపై జగన్నాథపురం వెళ్లి, తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. కోమటిపల్లి జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి, బొబ్బిలి నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ వెనుక నుంచి  ఢీకొట్టింది. ఈ ప్రమదంలో అప్పన్న అక్కడికక్కడే మృతి చెందా రు. మృతుడికి భార్య రమణమ్మ, ఇద్దరు ఆడపిల్లలు నాగమణి, శైలజ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

 

Updated Date - 2021-05-16T05:22:26+05:30 IST