హనుమాన్ జంక్షన్లో లారీ బీభత్సం
ABN , First Publish Date - 2021-01-15T23:51:03+05:30 IST
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్ను కారును లారీ ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న దంపతుల్లో
కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్ను కారును లారీ ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న దంపతుల్లో భర్త మృతి చెందాడు. భార్యకు రెండు కాళ్లు విరిగాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయ్యాయి. ఈ ప్రమాదంలో కారు, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. లారీ నూజివీడు నుంచి గుడివాడ వెళ్తుండగా ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.