కమనీయం శ్రీవారి కల్యాణం

ABN , First Publish Date - 2021-02-25T04:30:14+05:30 IST

పట్ణణంలోని ముసునూరు ట్రంకురోడ్డు వద్ద హనుమత్‌ క్షేత్రంలో వెలసివున్న లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మాత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్వామి, అమ్మణ్ణుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కమనీయం శ్రీవారి కల్యాణం
శ్రీవారి కల్యాణమహోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

కావలిటౌన్‌, ఫిబ్రవరి 24: పట్ణణంలోని ముసునూరు ట్రంకురోడ్డు వద్ద హనుమత్‌ క్షేత్రంలో వెలసివున్న లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మాత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్వామి, అమ్మణ్ణుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అర్చకుడు వేదగిరి సూర్యనారాయణాచార్యులు పర్యవేక్షణలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఉదయం స్వామికి తోమల సేవ, వధూవరులను చేయడం తదితర ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నిర్వహించిన కల్యాణమహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తిపారవశ్యంతో మంత్రముగ్దులయ్యారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి దంపతులు, ఆధ్యాత్మికవేత్త మన్నెమాల గోవిందురెడ్డి తదితర ప్రముఖులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటోనగర్‌ వారిచే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్ర హోమం పూజల అనంతరం రాత్రి శ్రీవారు గజ వాహనంపై పాతూరులో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.  గురువారం స్వామివారికి గ్రామోత్సవం, మందాటి చెరువులో తెప్పోత్సవ మహోత్సవం జరుగుతుందని అర్చకులు తెలిపారు.



Updated Date - 2021-02-25T04:30:14+05:30 IST