‘కామన్వెల్త్’లో లంక అథ్లెట్ల అదృశ్యం
ABN , First Publish Date - 2022-08-09T10:00:20+05:30 IST
కామన్వెల్త్ క్రీడల కోసం వచ్చిన 160 మందితో కూడిన శ్రీలంక అథ్లెట్ల బృందంలో పది మంది అదృశ్యమయ్యారు.
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల కోసం వచ్చిన 160 మందితో కూడిన శ్రీలంక అథ్లెట్ల బృందంలో పది మంది అదృశ్యమయ్యారు. వాళ్లకోసం వెతికితే ఎక్కడా కనిపించలేదనీ, ఫోన్లు చేస్తే స్పందన కూడా లేదని లంక జట్టు అధికారులు వెల్లడించారు. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అయితే మిస్ అయిన అథ్లెట్లకు తమ దేశం వెళ్లేందుకు ఇష్టం లేదని, వారు బ్రిటన్లోనే ఉపాధి వెతుక్కోవాలనుకుంటున్నట్టు సమచారం. ప్రస్తుతం ఆర్థికంగా లంక తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో అక్కడ కనీసం తినేందుకు తిండి దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.