Lanka Dinakar: పీఏం స్వనిధి పథకానికి జగనన్నతోడు స్టిక్కర్..
ABN , First Publish Date - 2022-08-03T16:23:50+05:30 IST
సీఎం జగన్పై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర విమర్శలు చేశారు.
విజయవాడ (Vijayawada): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై బీజేపీ (BJP) నేత లంకా దినకర్ (Lanka Dinakar) తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చిరు వ్యాపారులకు కేంద్ర తెచ్చిన పథకం పీఏం స్వనిధి (PM Swanidhi) అని, సీఎం జగన్ ఆ పథకానికి జగనన్నతోడు స్టిక్కర్ వేస్తున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారులకు రూ.10 వేలు ఆత్మనిర్భర నిధి ద్వారా.. వడ్డీ లేని రుణాలు కేంద్రం ఇస్తోందన్నారు. కేంద్రం స్వనిధి పథకాన్ని జగనన్న తోడు అంటున్న..రాష్ట్ర ప్రభుత్వ దురాలోచన ధోరణి బయటపడిందని లంకా దినకర్ అన్నారు.