జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలలో మూడో ర్యాంకు: లంకా దినకర్
ABN , First Publish Date - 2022-02-09T16:43:32+05:30 IST
జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలలో మూడవ ర్యాంకని లంకా దినకర్ విమర్శించారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలలో మూడవ ర్యాంకని, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో పదమూడో ర్యాంకని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి గతంలోకన్న అధికంగా యూరియా కేటాయించినప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైయస్ఆర్సీపీ పాలనలో రైతుభరోసా కేంద్రాలలో యూరియా దొరుకుతుందన్న భరోసా లేదు.. కానీ నల్లబజారులో మాత్రం దొరుకుతోందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసిన యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సి రావడం పాలనలో అసమర్థత కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నా.., ముఖ్యమంత్రిలో చలనం లేదని లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.