వసతి, దీవెన నిధులు కేంద్రం ఇస్తుంటే.. ఫోటో, స్టిక్కర్ జగన్‌దా?: లంకా దినకర్

ABN , First Publish Date - 2022-04-08T16:48:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వసతి, దీవెన నిధులు కేంద్రం ఇస్తుంటే.. ఫోటో, స్టిక్కర్ జగన్‌దా?: లంకా దినకర్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వసతి, దీవెన పథకం నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఫోటోలు, స్టిక్కర్లు సీఎం జగన్ వేసుకుంటున్నారని ఆరోపించారు. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం మాత్రమే విద్యార్థులకు అందిందని, గత రెండేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులు వసతి, దీవెనకు సర్దుబాటు చేసి పిల్లలకు రూ. 2వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ భాగం ఎగ్గొట్టిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు నిస్సిగ్గుగా సీఎం జగన్ తన స్టిక్కర్ మీద స్టిక్కర్ వేయడంలో ప్రపంచ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉన్నత విద్య, విదేశీ విద్యకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ఇచ్చే నిధులు ఎటు తరలించారని లంకా దినకర్ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-08T16:48:35+05:30 IST