100 వాట్ల బల్బు వాడినందుకు అద్దెకున్న వ్యక్తిని చంపిన ఓనర్
ABN , First Publish Date - 2020-05-26T00:59:06+05:30 IST
మనుషుల్లో సహనం నానాటికీ తగ్గిపోతోంది. అతి చిన్న కారణాలతో తమ ప్రాణాలు తీసుకోడానికైనా, ఎవరి ప్రాణాలైనా తీయడానికై...
న్యూఢిల్లీ: ఇంట్లో అద్దెకున్న వ్యక్తి 100 వాట్ల బల్బు వాడుతున్నాడన్న అతి చిన్న కారణంతో అతడి ప్రాణాలు బలి తీసుకున్నాడు ఓ ఓనర్. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి ఓనర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని హర్ష విహార్ ప్రాంతంలో జగదీశ్ అనే ఈ-రిక్షా డ్రైవర్ అద్దెకుంటున్నాడు. ఆ ఇల్లు అమిత్ అనే వ్యక్తికి చెందినది. అయితే జగదీశ్ ఇంట్లో 100 వాట్ల బల్బు వినియోగించడం గమనించిన అమిత్ అతడితో వాగ్వావాదానికి దిగాడు.
ఈ నేపథ్యంలో జగదీశ్పై అమిత్ చేయి చేసుకున్నాడు. దీంతో జగదీశ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా జగదీశ్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శవానికి పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్లు బయట ఎటువంటి దెబ్బలు కనిపించనప్పటికీ, తలలో తీవ్రమైన గాయమైందని, దానివల్ల లోపల రక్తస్రావమైందని తెలిపారు. జగదీశ్ మరణానికి అదే కారణమని వెల్లడించారు.