ఇంటి వద్దనే భూ రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2021-07-31T04:48:08+05:30 IST

ఇంటి వద్దనే భూ రిజిస్ట్రేషన్‌

ఇంటి వద్దనే భూ రిజిస్ట్రేషన్‌
మహిళ ఇంటికి వెళ్లిన అధికారులు

  • గొటిగఖుర్దులో లేవలేని స్థితిలో మహిళ  
  • ఇంటికి వెళ్లిన అధికారులు 

బషీరాబాద్‌: అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న ఓ   మహిళ ఇంటికే వెళ్లి రెవెన్యూ అధికారులు భూ రిజిస్ట్రేషన్‌ చేశారు. బషీరాబాద్‌ మండలం గొటిగఖుర్దు గ్రామానికి చెందిన అనంతమ్మ కుటుంబీకులు 4ఎకరాల 22 గుంటల వ్యవసాయ భూమిని హైదరాబాద్‌కు చెందిన వివేక్‌ కుమార్‌కు విక్రయించారు. భూమి అనంతమ్మ పేరిట ఉంది. ఆమె అనారోగ్యానికి గురై, లేవని స్థితిలో ఉండటంతో బషీరాబాద్‌ రెవెన్యూ కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు వెళ్లలేకపోయింది. దీంతో శుక్రవారం తహసీల్దార్‌ వెంకట్‌స్వామి, ఆపరేటర్లు అనురాధ, అరుణ్‌లు గొటిగఖుర్దులోని అనంతమ్మ ఇంటికే బయోమెట్రిక్‌ మిషన్‌, లాప్‌టాప్‌ తీసుకెళ్లారు. అనంతమ్మను తహసీల్దార్‌ విచారించి భూ కొనుగోలు దారుడికి రిజిస్ట్రేషన్‌ చేయించారు.

Updated Date - 2021-07-31T04:48:08+05:30 IST