విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల సేకరణ

ABN , First Publish Date - 2020-06-05T18:46:00+05:30 IST

ఏపీ ప్రభుత్వం జులై 8 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది.

విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల సేకరణ

విశాఖ: ఏపీ ప్రభుత్వం జులై 8 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరిస్తే విశాఖలో మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు సేకరించారు. అందులో ప్రభుత్వ భూములతోపాటుగా పేదలు, దళితులకు చెందిన భూములను ఎక్కవగా తీసుకున్నారు. నవరత్నాలలో భాగంగా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. విశాఖ నగర పరిధిలో సుమారు లక్షా 25వేల మంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలినచోట్ల ప్రభుత్వ భూములు, పేదలకు, దళితులకు ఇచ్చిన భూములను నేరుగా లాక్కుంటే.. విశాఖలో మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కుంది. ఇంతలో జీవీఎంసీ, స్థానిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచింది. తర్వాత కరోనా దెబ్బకు మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూములవైపు చూడ్డంతో ప్రజల్లో భయం మొదలైంది.


Updated Date - 2020-06-05T18:46:00+05:30 IST