భూముల కౌలు వేలం ఆదాయం రూ.4.02లక్షలు

ABN , First Publish Date - 2021-05-13T07:26:29+05:30 IST

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు వేలాన్ని బుధవారం నిర్వహించారు

భూముల కౌలు వేలం ఆదాయం రూ.4.02లక్షలు

 చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ భూములు

నార్కట్‌పల్లి, మే 12: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు వేలాన్ని బుధవారం నిర్వహించారు. ఈనెల 15 నుంచి 31-03-2022 కాలపరిమితికి నిర్వహించిన ఈ కౌలు వేలం ద్వారా రూ.4.02 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో అన్నెపర్తి సులో చన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, ధర్మకర్తలు, ఎండోమెంట్‌ పరిశీలకురాలు ఎం.వెంకటలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-13T07:26:29+05:30 IST