ఎమ్మెల్యే అంబటి పేరుతో భూకబ్జా దారుల బెదిరింపులు

ABN , First Publish Date - 2020-09-24T16:18:15+05:30 IST

సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి పేరుతో భూకబ్జా దారులు బెదిరింపులకు దిగారు.

ఎమ్మెల్యే అంబటి పేరుతో భూకబ్జా దారుల బెదిరింపులు

గుంటూరు జిల్లా: సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి పేరుతో భూ కబ్జాదారులు బెదిరింపులకు దిగారు. స్థలం దగ్గరకు ఎవరైనా వస్తే ముక్కలుగా నకుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ‘మంచిగా చెబుతున్నా వినకపోతే నీ ఇష్టం ..రేపు అంబటి కూడా వస్తున్నారు. అక్కడే నీ అంతు తెలుస్తానంటూ’ బెదిరిస్తున్నారు. దీంతో బాధితుడు భానుప్రసాద్(55) పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యాడు. 174 సర్వే నెంబర్‌లో స్థలం గల బాధితుడిని భూకబ్జా దారులు ఫోన్లో బెందిరించారు. భానుప్రసాద్ 2017లో 11 సెంట్లు స్దలం కొనుగోలు చేశాడు. అయితే అక్కడ కొంతమంది స్థలాలు భూ కబ్జాకు గురవ్వడంతో బాధితులంతా కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విషయం మీడియాకి తెలియడంతో భూకబ్జా దారులు చంపుతానంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

Updated Date - 2020-09-24T16:18:15+05:30 IST