మహిళను చెప్పుతో కొట్టి ఈడ్చుకెళ్లిన సర్పంచ్

ABN , First Publish Date - 2021-08-02T22:53:43+05:30 IST

మహిళను చెప్పుతో కొట్టి ఈడ్చుకెళ్లిన సర్పంచ్

మహిళను చెప్పుతో కొట్టి ఈడ్చుకెళ్లిన సర్పంచ్

మహబూబాబాద్: భూవివాదంలో సర్పంచ్ అనుచరులు దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం జెండాలో తండాలో జరిగింది. భూమి విషయంలో విజయ అనే యువతికి మహిళా సర్పంచ్‌కు వివాదం రేగింది. మాటా మాట పెరిగింది. విజయపై సర్పంచ్ చెప్పుతో దాడికి దిగారు. అంతేకాదు సర్పంచ్ అనుచరులు కూడా విజయపై దాడి చేశారు. దీంతో బాధిత మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విజయను ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 



Updated Date - 2021-08-02T22:53:43+05:30 IST