భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-29T05:18:58+05:30 IST

భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్‌

భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌

కలెక్టరేట్‌, జనవరి 28 : భూ  సేకరణ పనులు వేగవం తం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయ సమావేశ మంది రంలో ఉపకలెక్టర్లు, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. వంశధార, నాగావళి, మడ్డువలస రిజర్వాయర్లకు సంబంధిం చిన భూ సేకరణ, ప్లడ్‌ బ్యాంకులపై చర్చించారు. ఈ పనులకు అవసరమైన నిధులు ఉన్నాయని తెలిపారు. అయితే, పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు త్వరితగ తిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో  ఉప కలెక్టర్లు రవి సోసెఫ్‌, బి.శాంతి. ఎం.అప్పారావు, వంశధార ఎస్‌ఈ డి. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. 


అయోడిన్‌ ఉప్పుని వినియోగించండి: జేసీ  

అయోడిన్‌ ఉన్న ఉప్పును వినియోగించాలని జేసీ విజయసునీత తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అయోడిన్‌ లేని ఉప్పు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.  జిల్లాలో కేవలం 74.7 శాతం కుటుంబాలు మాత్రమే అయోడిన్‌ ఉప్పును ఉపయోగిస్తు న్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో    ప్రాజెక్టు మేనేజర్‌ ఇ.రమేష్‌, డీఎస్‌వో రమణ, ఆహార నియంత్రణాధికారి వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:18:58+05:30 IST