భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2020-10-20T06:10:08+05:30 IST

టేకులచెరువు గ్రామ శివారులో చేపట్టిన సీతారామ కాలువ పనులలో భాగంగా ఆదికారులు వంతెన ఏర్పాటు చేస్తున్నారు.

భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ

బూర్గంపాడు, ఆక్టోబరు 19: టేకులచెరువు గ్రామ శివారులో చేపట్టిన సీతారామ కాలువ పనులలో భాగంగా ఆదికారులు వంతెన ఏర్పాటు చేస్తున్నారు. వంతెన సమీప ప్రాంత రైతులకు కొంతమేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఐదు ఎకరాల భూమిని నిర్వాసితులు కోల్పోతున్నారు. బాధితులు గతంలో కలెక్టరును కలిసి తమ గోడును తెలుపుకున్నారు. సోమవారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ కిషోర్‌ టేకులచెరువులో బాధిత రైతులతో గ్రామసభ ఏర్పాటు చేయగా ఆదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఆభిపాయ్ర సేకరణ చేపట్టి ప్రభుత్వం నుంచి పరిహరం ఆందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీతారామ ప్రత్యేక నాయబ్‌ తహసీల్దార్‌ సునీత ఎలిజిబెత్‌, సర్పంచ్‌ భూక్యా సుజాత, ఉప సర్పంచు శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T06:10:08+05:30 IST