రూ.కోట్ల విలువైన భూమి స్వాధీనం

ABN , First Publish Date - 2020-08-04T10:55:50+05:30 IST

మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బీకేపల్లెలో రూ.కోట్ల విలువైన భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం ..

రూ.కోట్ల విలువైన భూమి స్వాధీనం

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 3: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బీకేపల్లెలో రూ.కోట్ల విలువైన భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సురే్‌షబాబు మాట్లాడుతూ... బీకేపల్లె సర్వే నెం.533-1ఎలో నరసింహారెడ్డి, సుజాత, రాజారెడ్డి, శివారెడ్డి, బయ్యారెడ్డి, జి.శివారెడ్డి అక్రమంగా షెడ్లు ఏర్పాటు చేసి అద్దెకిచ్చారని చెప్పారు. ఈ భూమికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వివాదాస్పద భూమి కావడంతో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు గుర్తుచేశారు. ఆర్‌ఐ చాణక్య, ఎస్‌ఐ వంశీధర్‌, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:55:50+05:30 IST