కరోనా విషయంలో తప్పుడు ఆశావాదం వద్దు, భారత్కు లాన్సెట్ సూచన
ABN , First Publish Date - 2020-09-26T21:42:42+05:30 IST
కరోనా వ్యాప్తి విషయంలో అంతా సవ్యంగా ఉందనే కథనాల కారణంగా తప్పుడు ధీమా పెరగకుండా చూసుకోవాలని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత్కు సూచించింది. ఇలాంటి తప్పుడు సానుకూల వైఖరితో వాస్తవ పరిస్థితి గుర్తించలేని పరిస్థితి నెలకొనవచ్చని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకు కూడా ఈ వైఖరి అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడింది.